కార్తికేయ 2 సెన్సార్ టాక్

నితిన్ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ 2 సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. విభిన్న కథలతో ప్రేక్షకులకు ఎప్పుడు కొత్తదనం అందించడంలో యంగ్ హీరో నిఖిల్ ముందుంటాడు. ఇప్పటికే పలు చిత్రాలతో ఆకట్టుకున్న నిఖిల్..ఇప్పుడు కార్తికేయ 2 తో ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చందూ మొండేటి – నిఖిల్ కలయికలో 2014 లో వచ్చిన కార్తికేయ‌ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ మాత్రమే కాదు వసూళ్ల వర్షం కురిపించింది. ఇపుడీ చిత్రానికి సీక్వెల్ కార్తికేయ 2 రాబోతుంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

ముందుగా ఈ సినిమా జూలై 22న భారీ స్థాయిలో థియేట్రికల్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, పలు కారణాల వల్ల వాయిదా పడిన ఈ మూవీ ఆగస్టు 12న విడుదల చేస్తున్నట్టు కొత్త తేదీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘కార్తికేయ 2’ ఒక్క కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ ని పొందింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందం వెల్లడించింది. ఇక ఈ సినిమాలో అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయని..కాన్సెప్ట్ ఆలోచనను రేకెత్తించే విధంగా ఉందని సెన్సార్ సభ్యులు తెలిపినట్లు తెలుస్తుంది. మరి సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.