కరోనా నుండి మనల్ని ఆ దేవుడే కాపాడాలి

మహమ్మారికి పేద, ధనిక తేడా లేదు..కర్ణాటక ఆరోగ్య మంత్రి

Karnataka health minister faces flak over ‘only God can save us

బెంగళూరు: కరోనా నుంచి ఆ దేవుడు మాత్రమే మనల్ని కాపాడగలడని కర్ణాటక ఆరోగ్య మంత్రి బి. రాములు అన్నారు. అయితే శ్రీరాములు చేసిన వ్యాఖ్యలు బిజెపిలో కూడా అంతర్గతంగా చర్చనీయాంశమయ్యాయి. కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయని… మహమ్మారికి పేద, ధనిక, కులం, మతం లేదని ఆయన చెప్పారు. దీనికి స్థాయి, అంతస్తు అనే తేడా లేదని అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజుల వ్యవధిలోనే డబుల్ అవుతాయని తెలిపారు. కేవలం భగవంతుడు మాత్రమే మనల్ని కాపాడగలడని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో కర్ణాటకలోని సొంత బిజెపి ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/