జగన్ బర్త్ డే గిఫ్ట్ : ఆకుపై జగన్ ఫొటో వేయించిన వైసీపీ నేత

ఏపీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈరోజు (డిసెంబర్ 21) 49 వ ఏటా అడుగుపెట్టారు. ఈ సందర్భాంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి . పార్టీ నేతలు , కార్య కర్తలు , అభిమానులు పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు జరిపారు. అలాగే మోడీ , చంద్రబాబు , పవన్ కళ్యాణ్ మొదలగు రాజకీయ నేతలు జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేశారు.

ఇదే తరుణంలో వైసీపీ నేతలు సైతం తమ నేతకు తమదైన స్టయిల్ లో విషెష్ అందించి వార్తల్లో నిలిచారు. విశాఖపట్నంలోని రుషికొండలో స్కూబా డైవింగ్ చేసిన బైరెడ్డి.. సముద్రం లోతుల్లోకి వెళ్లి సీఎంకు ముందస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే ఎమ్మెల్యే రోజా ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు తెలిపింది.ఇక వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ నేత కారుమూరు వెంకటరెడ్డి ఆకుపై జగన్ ఫొటోను వేయించి వినూత్న రీతిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఏడాది జగన్ పుట్టిన రోజు నాడు ఆయన విభిన్నంగా విషెష్ తెలుపుతుంటారు. 2019లో బాపట్ల బీచ్‌లో సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాల సైకిత శిల్పంను ఏర్పాటు చేశారు. 2020లో తన పంట పొలంలో జై జగన్ అని వచ్చేటట్లు వరికొత్త కోయించి డ్రోన్ ద్వారా చిత్రీకరించారు. ఈ ఏడాది ఆకుపై ముఖ్యమంత్రి జగన్ బొమ్మను వేయించారు.