తెలంగాణలో కరెంట్ చార్జీల పెంపు పై బీజేపీ శ్రేణుల నిరసన

కరీంనగర్ : తెలంగాణలో కరెంట్ చార్జీల పెంపుకు నిరసనగా బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు కరీంనగర్ లోని విద్యుత్ ఎస్.ఈ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నా కార్యక్రమం చేపట్టింది. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ సామాన్య ప్రజానీకాన్ని అడ్డగోలుగా దోచు కుంటుందని ఆరోపించారు. విద్యుత్ పై అనాలోచిత నిర్ణయాలు, విధానాలు, డిస్కంలు దివాలా తీయడానికి కారణమైయ్యారని మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వ వ్యవహార శైలి సామాన్య ప్రజలకు శాపంగా మారి కరెంట్ షాక్ తగిలే విధంగా ఉందని విమర్శించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/