క‌రాచీలో బాంబు పేలుడు : 12మంది మృతి

క‌రాచీ : పాకిస్థాన్ క‌రాచీలో బాంబు పేలుడు సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఉగ్ర‌దాడిలో 12మంది దుర్మ‌ర‌ణం చెందారు. ఈ భారీ పేలుడు ధాటికి.. పెద్ద‌, పెద్ద‌ భ‌వ‌నాలు ధ్వంసం అయ్యాయి. విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ఈ మేర‌కు స‌హాయ‌క‌చ‌ర్య‌లు కొన‌సాగించారు. కాగా ఈ సంఘ‌ట‌న లో చాలా మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంకా ఈ సంఘ‌ట‌న లో మ‌ర‌ణాల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉన్న‌ట్లు స‌మాచారం. కాగా ఈ ఘ‌ట‌న ఉగ్రవాదులే చేసి ఉంటార‌ని పాకిస్థాన్ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. కానీ అధికారికంగా.. మాత్రం ఉగ్రవాదులు.. ఈ సంఘ‌ట‌న పై ఎలాంటి ప్ర‌క‌ట‌న అధికారికంగా చేయ‌లేదు. దీని పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/