ఎడారి దేశంలో కపూర్ సిస్టర్స్ హంగామా
స్నేహితుడు ఓర్హాన్ అవత్రమణితో కలిసి విహారయాత్ర
జాన్వీకపూర్ తన దుబాయ్ ట్రావెల్ డైరీల నుండి ఫోటోషూట్ డంప్ ను షేర్ చేసింది. జాన్వీ కపూర్ – ఖుషీ కపూర్ తమ స్నేహితుడు ఓర్హాన్ అవత్రమణితో కలిసి దుబాయ్ కి విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ చలికాలాన్ని తమకు నచ్చినట్టుగా ఆస్వాదించినట్టు తెలుస్తోంది. జాన్వీ అలా హెడ్ స్కార్ప్ ని ధరించి హల్ చల్ చేసింది.
తనతో పాటే సోదరి ఖుషీ కపూర్ ఏమాత్రం ఏ విషయంలోనూ అస్సలు తగ్గడం లేదు. జాన్వీ – ఖుషీ సిస్టర్స్ ఎడారి జీప్ పై పోజులిచ్చిన ఫోటోలు వైరల్ గా మారారు. ‘డెస్సర్ట్ ఇన్ ది డిజర్ట్ ‘ అని జాన్వీ కపూర్ కాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/