టీమిండియా ఓటమిపై నిప్పులు చెరిగిన కపిల్‌ దేవ్‌

Kapil Dev
Kapil Dev

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా ప్రదర్శనపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ టీమిండియాపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ భారత ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డారు. మ్యాచ్ ను విమర్శనాత్మకంగా విశ్లేషిస్తే అన్ని మార్పులు ఎలా చేస్తారో అర్థం కావడం లేదని, ప్రతి మ్యాచులోనూ కొత్త జట్టు ఉంటోందని, జట్టులో ఎవరు కూడా శాశ్వతంగా ఉండడం లేదని, అటగాడి స్థానంపై భద్రత లేదని, ఇది ఆటగాళ్ల ఫామ్ ను ప్రభావితం చేస్తుందని ఆయన టీమిండియాను ఉద్దేశించి అన్నారు. టెస్టు జట్టులోకి కేఎల్ రాహుల్ ను తీసుకోకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనకేమీ అర్థం కావడం లేదని, నువ్వేమీ ఆడావు… ఏం జరుగుతుందనే వాటికి మధ్య చాలా తేడా ఉంటుందని ఆయన అన్నారు. జట్టును పటిష్టం చేయాలనుకుంటే ఆటగాళ్లకు విశ్వాసం కలిగించాలని, మార్పులు ఎక్కువగా చేస్తున్నప్పుడు దానికి అర్థం ఉండదని ఆయన అన్నారు. 

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/