ఇందిరా జైసింగ్పై కంగానా రనౌత్ ఆగ్రహం
దోషులతో పాటు నాలుగు రోజులు జైళ్లో ఉంచాలి
న్యూఢిల్లీ: నిర్భయ దోషులను క్షమించాలని కోరిన ప్రముఖ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్పై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన కంగనా విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా నిర్భయ తల్లికి ఇందిరా జైసింగ్ చేసిన అభ్యర్థన గురించి ప్రస్తావించగా… అలాంటి మహిళలను దోషులతో పాటు నాలుగు రోజుల పాటు జైళ్లో ఉంచాలి. కచ్చితంగా వారితో కలిసి ఉండేలా చేయాలి. అప్పుడే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. వీళ్లకు దోషులు, హంతకులపైన ప్రేమ, దయ, జాలి పుట్టుకువస్తాయి. ఇలాంటి వాళ్లే మృగాళ్లకు.. హంతకులకు జన్మనిస్తారు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/