క‌మ‌లాపురంలో జగన్ మేనమామ మాట నిలుపుకున్నారు

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మేన‌మామ‌, ఎమ్మెల్యే పి.ర‌వీంద్ర‌నాథ‌రెడ్డి తన మాటను నిలబెట్టుకున్నారు. క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఈ ప్రభంజనానికి కారణం ర‌వీంద్ర‌నాథ‌రెడ్డినే. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ముఖ్య‌మంత్రి మేన‌మామ ర‌వీంద్ర‌నాథ‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తుండ‌డంతో స‌హ‌జంగానే అంద‌రి దృష్టి ఆక‌ర్షించింది. ఏ మాత్రం తేడా వ‌చ్చినా ర‌వీంద్ర‌నాథ‌రెడ్డి ఫై జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు.

అందుకే ముందు నుండి కూడా జాగ్రత్తపడుతూ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డారు. దీంతో మొత్తం 20 వార్డుల‌కు గాను 15 వార్డులో వైసీపీ విజ‌యం సాధించింది. టీడీపీ కేవ‌లం ఐదు వార్డుల్లో మాత్ర‌మే సత్తా చాటింది. టీడీపీ గెలుపొందిన ఐదు వార్డుల్లో తక్కువ మెజారిటీ తో గెలుపొందారు. క‌మ‌లాపురం న‌గ‌ర పంచాయ‌తీలో టీడీపీ అభ్య‌ర్థులు 1,6, 12,13,19వ వార్డుల్లో విజ‌యం సాధించారు. 6వ వార్డులో 20 ఓట్లు, 12వ వార్డులో 2 ఓట్లు, 13వ వార్డులో 7 ఓట్లు, 19వ వార్డులో కేవ‌లం 3 ఓట్ల మెజార్టీతో మాత్ర‌మే టీడీపీ అభ్య‌ర్థులు విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు.