సంక్షోభంలో కమల్నాథ్ ప్రభుత్వం
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి కమల్నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బిజెపి కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను బిజెపి నేతలు ప్రలోభాలు చూపి హర్యానాలోని ఒక హోటల్కు తరలించారు. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి తరుణ్ భానోత్ ధృవీకరించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/