శరత్ బాబుకు నివాళి తెలిపి తప్పు చేసిన కమల్ హాసన్

సీనియర్ నటుడు శరత్ బాబు గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రవైట్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్నటి నుండి శరత్ బాబు చనిపోయారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో వార్తలు ప్రచారం అవ్వడం మొదలు అయ్యాయి. దీంతో చాలామంది అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఆయనకు నివాళ్లు అర్పిస్తూ వస్తున్నారు. ఈ వార్తలు చూసి పొరపాటు పడిన కమల్ హాసన్ సైతం శరత్ బాబు కు నివాళ్లు అర్పించారు.

‘‘నా ప్రియమైన పెద్దన్నయ్య శరత్ బాబు నాకు స్నేహితుడు. మంచి మనసున్న వ్యక్తి, శ్రేయోభిలాషి. నీవు నటించిన ఎన్నో సినిమాలు నిన్ను ఎప్పటికీ మా మధ్య చిరంజీవిగా నిలిపి ఉంచుతాయి. మన కథలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి.. ఆయన జ్ఞాపకాలు కూడా’’ అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు. తర్వాత జరిగిన తప్పును తెలుసుకుని ఆ ట్వీట్ ను తొలగించారు.

ఒక ప్రముఖ నటుడి ఆరోగ్యం విషమించి చికిత్స తీసుకుంటున్న తరుణంలో ఇలాంటి తొందరపాటు చర్యలు నవ్వుల పాలు చేస్తాయని రుజువైంది. కమల్ హాసన్ అనే కాదు, మరికొందరు సైతం ఇలానే చేశారు. అనంతరం శరత్ బాబు మరణ వార్తలను ఆమె సోదరి ఖండించారు. శరత్ బాబుపై సోషల్ మీడియాలో తప్పుగా వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆయన కొంచెం కోలుకున్నారని ఆయన సోదరి ప్రకటించడం గమనార్హం.