హాస్పటల్ లో చేరిన కమల్ హాసన్

లోకనాయకుడు కమల్ హాసన్ హాస్పటల్ లో చేరినట్లు స్వయంగా ఆయనే ప్రకటించారు. తనకు కరోనా సోకిందని విషయాన్నీ చెప్పకుండా..మహమ్మారి ఇంకా మన మధ్యే ఉందని, దానితో జాగ్రత్తగా ఉండాలని కమల్ హాసన్ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ బట్టి చూస్తే కమల్ కరోనా బారినపడినట్లు తెలుస్తుంది.

‘యూ.ఎస్. ట్రిప్ నుండి తిరిగి వచ్చాక కాస్తంత దగ్గు వచ్చిందని, పరీక్షలు నిర్వహించగా ఇన్ ఫెక్షన్ ఉందని వైద్యులు నిర్థారించారని అన్నారు. దాంతో హాస్పిటల్ లో ఐసొలేషన్ లో ఉన్నట్టు కమల్ హాసన్ ప్రకటించారు. కమల్ హాసన్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టగానే, ఆయన త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను అభిమానులంతా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు’ సీక్వెల్ ‘ఇండియన్ 2’, ‘ఖైది’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో ‘విక్రమ్’ సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు తమిళ్ బిగ్ బాస్ షో చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఆ షో కు ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారనేది ఆసక్తి గా మారింది.

அமெரிக்கப் பயணம் முடிந்து திரும்பிய பின் லேசான இருமல் இருந்தது. பரிசோதனை செய்ததில் கோவிட் தொற்று உறுதியானது. மருத்துவமனையில் தனிமைப்படுத்திக் கொண்டுள்ளேன். இன்னமும் நோய்ப்பரவல் நீங்கவில்லையென்பதை உணர்ந்து அனைவரும் பாதுகாப்பாக இருங்கள்.— Kamal Haasan (@ikamalhaasan) November 22, 2021