ప్రతీకారం చుట్టే సీఎం జగన్‌ పరిపాలన

అమరావతిపై సీఎం మాట్లాడే మాటలకు వ్యవహరిస్తున్న తీరుకు పొంతన లేదు

Kala Venkata Rao
Kala Venkata Rao

విజయవాడ: ప్రతీకారం చుట్టే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలన సాగుతుందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ అన్నారు. విజయవాడలో ఆయన నేడు మీడియాతో మాట్లాడారు. నారావారిపల్లెలో వైఎస్సార్‌సిపి తలపెట్టిన బహిరంగ సభ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై కక్షకు నిదర్శమన్నారు. ఇదే చొరవ ఆంధ్రప్రదేశ్‌ అబివృద్ధిపై చూపడం లేదని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న రాయలసీమను వైఎస్సార్‌సిపి ప్రభుత్వం ప్రాంతీయ విద్వేషాలకు అడ్డాగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని కళా వెంకట్రావ్‌ మండిపడ్డారు. రాజధాని అమరావతిపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడే మాటలకు వ్యవహరిస్తున్న తీరుకు ఏమాత్రం పొంతన లేదని విమర్శించారు. అమరావతిపై ప్రజల దృష్టిపై మరల్చేందుకే రాయలసీమలో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/