వరంగల్‌లో ఏడు రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ వేడుకలు

kakatiya dynasty in telangana

వరంగల్‌లో ఏడు రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ వేడుకలు అట్టహాసంగా జరపాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన అన్నివర్గాల మేధావులు, కవులు, సాహితీవేత్తలను గౌరవించుకొవాలన్నారు. జూలై 7 నుంచి వరంగల్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏడు రోజుల పాటు నిర్వహించనున్న కాకతీయ వైభవ సప్తాహంపై ప్రగతిభవన్‌లో సోమవారం సన్నాహక సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కాకతీయుల వైభవాన్ని, ప్రతిష్ఠను పెంచేవిధంగా ఖర్చుకు వెనుకాడకుండా రాజకీయాలకు అతీతంగా, అందరూ పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు. సాహితీ, సాంసృతిక, కళ కార్యక్రమాలను, మేథో చర్చలను రూపొందించాలన్నారు. విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొనేలా కార్యక్రమాలు ఉండాలన్నారు. ప్రజలందరూ గర్వపడేలా ఉత్సవాలు ఉండాలని అధికారులను సూచించారు. వరంగల్‌ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా, పండుగ వాతావరణం నెలకొనేలా విద్యుత్‌ దీపాలతో అలంకరించాలన్నారు. కాకతీయ వైభవ సప్తాహన్ని విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు.