మునుగోడు ఫలితాల ఫై కేఏ పాల్ కామెంట్స్
మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 11 వేల మెజార్టీ తో విజయం సాధించింది. ఈ విజయంతో టిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే..ఇతర పార్టీలు దిగులు పడుతున్నారు. ఇదిలా ఉంటె టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు లక్ష ఓట్లు పడ్డాయంటే నవ్వొస్తోంది అంటూ కేపాల్ కామెంట్స్ చేసారు. ఈవీఎంలు మార్చారు … జిల్లా అధికారులు టీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు’’ అని విమర్శించారు. ఈవీఎంలు మార్చడంలో అధికారుల పాత్ర ఉందన్న ఆయన.. అవినీతి చేసిన ఎన్నికల అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.మునుగోడులో ఏం చేశారని సీఎం కేసీఆర్ కు ప్రజలు ఓటేస్తారని ప్రశ్నించారు.
క్రిస్టియన్ సంఘాల 25వేల ఓట్లు ఎక్కడ ? అని కేఏ పాల్ ప్రశ్నించారు. తాను నిర్వహించిన సభలకు వందల నుంచి వేల మంది ప్రజలు తరలివచ్చారన్నారు. ఆ ప్రజల ఓట్లన్నీ ఎక్కడికి పోయాయన్నారు. ఎన్నికల సమయంలోనే తనను అభ్యర్ధిగా ప్రకటించకుండా కుట్ర పన్నారని విమర్శించారు. ధర్నా చేసిన అనంతరం అభ్యర్ధిగా ప్రకటించారని తెలిపారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు వద్దు.. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని గతం నుంచి డిమాండ్ చేస్తున్నానని వెల్లడించారు.