నిండిన జూరాల..ఎనిమిది గేట్లు ఎత్తి వేత

Jurala Project

గద్వాల: జోగులాంబ జిల్లాలోని జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. దీంతో ఎనిమిది గేట్లు ఎత్తి 83,779 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లుకాగా, ప్రస్తుతం 318.100 మీటర్ల వరకు నీరు ఉన్నది. దీంతో డ్యాంలో ప్రస్తుతం 8.810 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. జలాశయం పూర్తిగా నిండితే 9.657 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. అయితే ఎగువనుంచి 75 వేల క్యూసెక్యుల నీరు డ్యామ్‌లోకి వచ్చి చేరుతుండటంతో అధికారులు ఎనిమిది గేట్లను ఎత్తివేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/