ప్రభుత్వంతో జూనియర్‌ డాక్టర్ల చర్చలు సఫలం

అమరావతి: ఏపీ ప్రభుత్వంతో జూనియర్‌ డాక్టర్ల చర్చలు సఫలమయ్యాయి. చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు జూనియర్‌ డాక్టర్లు ప్రకటించారు. జూనియర్ డాక్టర్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని, ముఖ్య కార్యదర్శి చర్చలు జరిపారు. డిమాండ్‌లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఈ సందర్భంగా జూనియర్‌ డాక్టర్లు తెలిపారు.


కాగా, రాష్ట్రంలో బుధవారం జూనియర్ డాక్టర్ల సమ్మకు దిగారు. ఆరోగ్య భద్రత, కోవిడ్ ఇంటెన్సివ్, ఎక్స్‌గ్రేషియా, స్టైఫండ్, ఆస్పత్రులలో భద్రత కల్పించాలనే డిమాండ్‌లను ప్రభుత్వం ముందు ఉంచారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జూడాలు స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో సమ్మె విరిమిస్తున్నట్లు డాక్టర్లు ప్రకటించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/