కేరళ గవర్నర్ కు జడ్ ప్లస్ భద్రత
కేరళ: కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ ముహమ్మద్ ఖాన్కు జడ్ ప్లస్ భద్రతను కల్పించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పౌరసత్వ సవరణ చట్టానికి మద్ధతు ఇస్తూ గవర్నర్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతనికి కల్పించిన భద్రతను జడ్ కేటగిరి నుంచి జడ్ ప్లస్ కేటగిరీకి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న దృష్ట్యా గవర్నరుకు భద్రతను పెంచారు.కేరళ రాష్ట్ర రాజ్ భవన్ తోపాటు గవర్నరు ఆరిఫ్ ముహమ్మద్ ఖాన్ కు వ్యక్తిగత భద్రతను పెంచాలని నిర్ణయించారు. పౌరగసత్వ సవరణ చట్టానికి గవర్నరు ముహమ్మద్ ఆరిఫ్ ఖాన్ సమర్థిస్తుండగా, కేరళ సర్కారు దాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/