జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార కేసు లో కీలక వివరాలు బయటకొచ్చాయి

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌లో బాలిక అత్యాచార కేసులో పలు కీలక వివరాలు బయటకువచ్చాయి. ప్రస్తుతం ఈ ఘటన కు పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. బాధిత బాలికతోపాటు మరో బాలికను నిందితులు వేధించినట్లు పేర్కొన్నారు.

ఈ కేసులో కార్పొరేటర్ కుమారుడే ప్రధాన సూత్రధారిగా పోలీసులు చెప్పుకొచ్చారు. నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌తో కలిసి పబ్‌లో అరాచకాలు సృష్టించినట్లు తెలిపారు. సాదుద్దీన్‌ మాలిక్‌, కార్పొరేటర్‌ కొడుకు కలిసి ఇద్దరు బాలికలను వేదించారట. నిందితుల వేధింపులు భరించలేక పబ్ నుంచి బయటకు బాలికలు వచ్చారని..ఆలా వచ్చిన వారిలో ఓ బాలిక నేరుగా క్యాబ్ తీసుకొని వెళ్లిపోయింది. బాలికల వెనకాలే సాదుద్దీన్ అండ్ గ్యాంగ్ బయటకు వచ్చింది. పబ్ ముందే నిలబడ్డ బాధిత బాలికను కార్పొరేటర్ కొడుకు ట్రాప్ చేశాడు. ఇంటి వద్ద దించుతామని ఆ గ్యాంగ్ నమ్మించారు. మాజీ ఎమ్మెల్యే మనవడు ఉమేర్‌ఖాన్‌కు చెందిన బెంజ్‌ కారులో.. అమ్మాయితో కలిసి నలుగురు ప్రయాణించారు. పబ్ నుంచి నేరుగా కాన్సూ బేకరి వరకు గ్యాంగ్ వెళ్లింది. బెంజ్‌ కారులోనే అమ్మాయి పట్ల గ్యాంగ్ అసభ్యకరంగా ప్రవర్తించింది. అరాచకాలు భరించలేక కాన్సూ బేకరి నుంచి బాధిత బాలిక వెళ్లిపోతానని తెలిపింది. బాలికను మళ్లీ బెంజ్‌ కారులో ఎక్కించుకొని కొద్దిదూరం ప్రయాణించారు. ఫోన్‌ కాల్‌తో మధ్యలో దిగి ఎమ్మెల్యే కుమారుడు వెళ్లిపోయాడు. బెంజ్‌ కారులో పెట్రోల్ అయ్యిపోయిందంటూ గ్యాంగ్ డ్రామాలు ఆడింది. వెనుకాలే మరో ఇన్నోవాలో వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు వచ్చాడు. ఆ తర్వాత బాలికను గ్యాంగ్ ఇన్నోవాలోకి తరలించింది. బంజారాహిల్స్‌లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై గ్యాంగ్ అత్యాచారానికి పాల్పడింది. అత్యాచారం తర్వాత నిందితులు బేకరికి వచ్చి.. ఎంజాయ్ చేశామని గ్రూప్ ఫోటో దిగి ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఆ తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇక ఈ ఘటనను… రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఘటనపై వివరణ ఇవ్వాలని డీజీపీని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు.