మరికాసేపట్లో అమిత్ షా తో జూ. ఎన్టీఆర్ భేటీ

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో సినీ నటుడు జూ. ఎన్టీఆర్ భేటీ కాబోతున్నారు. అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీ కావడం సర్వత్రా చర్చగా మారింది. అయితే ఈ భేటీ వెనుక రాజకీయ అంశాలు ఏమిలేవని ..ఆర్ఆర్ఆర్ చూసి ఎన్టీఆర్ నటనకు ఫిదా అయినా అమిత్ షా..హైదరాబాద్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ తో భేటీ కావాలని అనుకున్నారట. ఈరోజు మునుగోడు పర్యటన నిమిత్తం వచ్చిన అమిత్ షా..ఎన్టీఆర్ ను కలవాలని చెప్పడంతో ఎన్టీఆర్ భేటీ కాబోతున్నట్లు బిజెపి నేతలు చెపుతున్నారు. నోవాటెల్ లో ఎన్టీఆర్ – అమిత్ షా భేటీ కానున్నారు. అలాగే కలిసి డిన్నర్ చేయనున్నట్లు తెలుస్తుంది.

బిజెపి నేతల ఇలా చెపుతుంటే..రాజకీయ విశ్లేషకులు మాత్రం రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన అమిత్ షా ముందస్తు రాజకీయ స్ట్రాటజీల్లో భాగంగానే.. ఎన్టీఆర్ తో సమావేశం అవుతున్నారని చెపుతున్నారు. అయితే, ఇప్పుడు ఇది ప్రధానంగా టీడీపీ నేతల్లో చర్చకు కారణమవుతోంది. తాను పూర్తిగా సినిమాల పైనే ఫోకస్ చేసానని జూ ఎన్టీఆర్ కొంత కాలంగా చెబుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు అమిత్ షా తో భేటీ ద్వారా బీజేపీ..ఇటు తెలంగాణలో.. అటు ఏపీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారక్ ను తమ పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికి అమిత్ షా – ఎన్టీఆర్ కలవడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.