హైదరాబాద్ చేరుకున్నజేపీ నడ్డా
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రత్యేక వినానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న నడ్డాకు ఎమ్మెల్యే రాజాసింగ్, పెద్దిరెడ్డి, కన్నా లక్ష్మినారాయణ స్వాగతం పలికారు. నడ్డా బేగంపేట నుంచి నేరుగా కొత్తపేటకు చేరుకోనున్నారు. అక్కడ కొత్తపేట చౌరస్తా నుంచి నాగోల్ వరకు జరిగే రోడ్ షో లో నడ్డా పాల్గొననున్నారు. అనంతరం బంజారాహిల్స్లోని తాజ్బంజారా హోటల్లో నిర్వహంచనున్న మేథావుల సదస్సులో జేపీ నడ్డా పాల్గొని మాట్లాడనున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/