టిఆర్ఎస్ లీడర్స్ అంత కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు – నడ్డా

టిఆర్ఎస్ లీడర్స్ అంత కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని , కుటుంబవాదాన్ని వ్యాపింపజేసే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారని, క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి, అక్రమాలకు తెగబడ్డారని ఆరోపించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగిసింది. ఈ సందర్భాంగా కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిధిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.

ఈ సందర్బంగా నడ్డా మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి, అక్రమాలకు తెగబడ్డారని ఆరోపించారు. ధరణి పోర్టల్ ను వాడుకొని టీఆర్ఎస్ వాళ్లు అక్రమ సంపాదన పోగేస్తున్నారని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎందుకు విచారిస్తున్నయ్ అని నడ్డా ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తనకోసం ఫాంహౌస్ కట్టుకున్న కేసీఆర్.. ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మాత్రం ఇవ్వడం లేదు’ అని ఆరోపించారు.

ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం మాత్రమేనని, ఇది ఆగేదికాదని నడ్డా స్పష్టం చేశారు. ప్రజా గోస-బీజేపీ భరోసా కార్యక్రమం కూడా కొనసాగుతుందని వెల్లడించారు. తెలంగాణను కేసీఆర్ అప్పులకుప్పగా మార్చేశారని, అందినంత దోచుకోవడం, దాచుకోవడమే కేసీఆర్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలన అంతా అవినీతి, అక్రమాలేనని విమర్శించారు. కేసీఆర్ కు ప్రజలు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని నడ్డా వ్యాఖ్యానించారు.