రేపు ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనబోతున్న జేపీ నడ్డా..

బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర లో రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనబోతున్నారు. గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే ఈ యాత్ర ఫై అధికార టీఆర్ఎస్ పార్టీ పలు విమర్శలు చేస్తున్నప్పటికీ..అదే స్థాయిలో సంజయ్ వారికీ కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. యాత్రలో బండి సంజయ్ నేరుగా టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తూ.. పలు అవినీతి ఆరోపణలు కురిపిస్తూ వస్తున్నారు.

కాగా రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ యాత్రలో పాల్గొననున్నారు. రేపు మధ్యహ్నం 12.40ని.లకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి జేపీ నడ్డా చేరుకుని… నోవాటెల్ లో లంచ్ చేసిన తర్వాత రోడ్డు మార్గాన పాలమూరు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5 గంటల వరకు ఆఫీస్ బేర్సర్ మీటింగ్ లో పాల్గొననున్నారు. 6 నుంచి 8 గంటలక వరకు మహబూబ్ నగర్ లోని పబ్లిక్ మీటింగ్ తో హాజరుకానున్నారు. ఈ సభకు భారీగా జనాలను తరలించేందుకు పెద్ద ఎత్తున్న జన సమీకరణపై బీజేపీ పార్టీ దృష్టి పెట్టింది. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 14న రాష్ట్రానికి రానున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం లో నిర్వహించే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొననున్నారు.