బాలయ్యకు మంత్రి జోగి స్ట్రాంగ్ కౌంటర్

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ని కాస్త వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ నేతలు , కార్య కర్తలే కాక నందమూరి ఫ్యామిలీ సభ్యులు సైతం జగన్ సర్కార్ ను తప్పుపడుతున్నారు. జూ. ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ తదితరులు సోషల్ మీడియా ద్వారా స్పందించగా..తాజాగా బాలకృష్ణ జగన్ ప్రభుత్వం ఫై శాపనార్దాలు పెట్టారు.

.. ‘మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి ఎన్టీఆర్‌ అన్నది పేరుకాదు. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు’ అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.

కాగా బాలయ్య వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్‌ కౌంటర్ ఇచ్చారు. 3 రోజుల తరువాత బాలకృష్ణ స్పృహలోకి వచ్చినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ‘ఎన్టీఆర్‌ను ఈ జాతి నుంచి దూరం చేసిందెవరు? అని ప్రశ్నించారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిందెవరు? పార్టీని, ట్రస్ట్‌ను లాక్కుని, సీఎం పీఠంపై మీ బావ కూర్చోలేదా? అప్పుడు బాలకృష్ణ ఏం చేశారు? శునకం ఎవరు? ఆ శునకానికి తోక ఎవరు? చంద్రబాబుకు బుద్ధి చెప్పండి అన్న ఎన్టీఆర్ చివరి కోరికను మీరు నెరవేర్చలేదు. చంద్రబాబు విసిరిన ఎంగిలి మెతుకులు తిన్నదెవరు? ఎన్టీఆర్‌ను కూలదోసినప్పుడు బాలకృష్ణ నవ్వుతూ ఆనందించారు. అయినా మీ కూతురును ఆయన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశారు. సినిమాల్లోనే నువ్ హీరోవి. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టునే బాలకృష్ణ ట్వీట్‌ చేశారు.’ అని ఘాటైన పదజాలంతో తీవ్రంగా విమర్శించారు మంత్రి జోగి రమేష్.