సమావేశంలో కంటతడి పెట్టిన బైడెన్
కరోనా బాధితుల బాధలు చెప్పిన నర్సు

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడన్ ఆరోగ్య సిబ్బందితో జరిగిన ఓ అన్లైన్ సమావేశం సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. వర్చువల్ పద్ధతిలో ఆయన వైద్య సిబ్బందితో మాట్లాడుతుండగా.. మిన్నెసోటాకు చెందిన మేరీ టర్నర్ అనే నర్సు తన అనుభవాలను చెప్పింది. కరోనా బాధితులు తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కోసం బాధపడేవారని ఆమె జో బైడెన్ కు తెలిపింది. దీంతో తాను వారి చేతులను తన చేతుల్లోకి తీసుకుని ఓదార్చానని చెప్పింది. దీంతో బైడెన్ భావోద్వాగానికి గురై కంట తడి పెట్టారు. కాగా, పీపీఈ కిట్ల కొరత ఉందని, దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైద్య సిబ్బంది ఆయనకు తెలిపారు. ప్లాస్టిక్ సంచులను వాడుతున్నామని కొందరు వైద్య సిబ్బంది బైడెన్కి వివరించారు. అలాగే, వాడిన ఎన్ 95 మాస్కులనే తిరిగి వాడడంలో అవి లూజైపోయి కింద పడిపోయేవని చెప్పారు.
తాజా జాతీయ వార్తల కసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/