ట్రంప్ వలస విధానలకు స్వస్తి
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రవేశపెట్టిన కఠిన వలసల విధానాలకు అధ్యక్షుడు జో బైడెన్ స్వస్తి పలికారు. ఈ మేరకు మూడు కార్యనిర్వాహక ఆదేశాలపై ఆయన మంగళవారం సంతకం చేశారు. పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేసినటువంటి నిబంధనలు సహా ట్రంప్ కఠిన వలస విధానాలు రద్దవుతాయని బైడెన్ తెలిపారు. అమెరికా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న భారతీయుకు బైడెన్ నిర్ణయం లబ్ధి చేకూర్చనున్నది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/