కరోనా పై పోరుకు జొకోవిచ్ భారి విరాళం
కరోనా నివారణకు వినియోగించాలని వినతి
సెర్బియా: కరోనా పై పోరుకు ప్రపంచ టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ భారి విరాళాన్ని ప్రకటించాడు. కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుందని అన్నాడు. జకోవిచ్ తన వంతుగా 1.1 మిలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించి తన సహృదయతను చాటుకున్నాడు. ఈ మొత్తాన్ని వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు, శానిటరి వస్తువులకు ఉపయోగించాలని సెర్బియా ప్రభుత్వాన్ని కోరాడు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/