బిగ్ బాస్ 5 : బిగ్ బాస్ వేదిక ఫై షన్ను – సిరి లను కడిగిపారేసిన జెస్సీ

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 చివరి వారానికి వచ్చేసింది. ఈరోజు హౌస్లో ఉన్న ఆరుగురు సభ్యుల్లో ఒకరు ఎలిమినేటి అయ్యి బయటకు వస్తారు. ప్రస్తుతం బయటకు వచ్చేది కాజల్ అని తెలుస్తుంది. ఇక ఈరోజు జరిగే ఎపిసోడ్ లో బిగ్‌బాస్ 5 మాజీ హౌస్‌మేట్స్ ప్రత్యక్షం కానున్నారు. హౌస్‌లో కొనసాగుతోన్న కంటెస్టెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడబోతున్నారు.

దీనికి సంబంధించిన ఓ ప్రొమోను నిర్వాహకులు విడుదల చేశారు. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు జెస్సీ అలియాస్ జశ్వంత్ పడాల, ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ.. ఈ ప్రొమోలో ప్రత్యక్షం అయ్యారు. వారిద్దరూ సిరి హన్మంతు, షణ్ముఖ్ జశ్వంత్, మానస్ నాగులపల్లితో మాట్లాడటం.. వారిని నిలదీయడం ఈ ప్రొమోలో కనిపించిది. జెస్సీ సైతం.. సిరి హన్మంతు-షణ్ముఖ్ జశ్వంత్ మధ్య బిగ్‌బాస్ హౌస్‌లో నడుస్తోన్న ట్రాక్ గురించి జెస్సీ సూటిగా ప్రస్తావించాడు. మీ వ్యవహారాన్ని చూసి జనాలు ఏమనుకుంటున్నారో.. నువ్వెప్పుడైనా థింక్ చేశావా? షన్ను. చాలా సీరియస్‌గా అడుగుతున్నాను. నీకు, సిరికి ఎలాంటి బాండింగ్ ఉందో.. జనాలు ఏమనుకుంటున్నారో.. నువ్వెప్పుడైనా థింక్ చేశావా?..అని నిలదీశాడు. ఊహించని విధంగా జెస్సీ నుంచి వచ్చిన ఈ ప్రశ్నకు షణ్ముఖ్ బిత్తర చూపులు చూశాడు. అలాగే సిరిపై కూడా ఘాటుగా ప్రశ్నలను సంధించాడు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి ఎమోషనల్‌కు కనెక్టయిపోతున్నామా? అది కనెక్టయిపోతున్నామా? ఇది కనెక్టయిపోతున్నామా? అని చెప్పి పిచ్చెక్కిపోతున్నావ్. అవసరమా నీకు.. అని సూటిగా సిరిని ప్రశ్నించాడు జెస్సీ. దీనిపై వారి నుంచి ఏం సమాధానం వస్తుందనేది ఈ రాత్రి ఎపిసోడ్‌లో స్పష్టమౌతుంది.

YouTube video