కరోనా వ్యాప్తి తరుణంలో కేసిఆర్ సభ ఎందుకు ?

రద్దు చేయాలి : జీవన్ రెడ్డి డిమాండ్

Nalgonda: సీఎం కేసీఆర్ ఈ నెల 14న హాలియాలో బహిరంగ సభను రద్దు చేసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవైపు రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని అన్నారు. ‌ ఓటమి భయంతో కే సి ఆర్ రెండో సారి సభ పెడుతున్నారని, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఆయన తన సభను రద్దు చేసుకోవాలని అన్నారు. సిఏం సభకు జిల్లా అధికారులు అనుమతి ఇవ్వకూడని ఆయన డిమాండ్ చేశారు..

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/