రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలి

కేంద్రంపై నిందలు మోపుతూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది

jeevan reddy
jeevan reddy

హైదరాబాద్‌: కేంద్రంపై నిందలు మోపుతూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి విమర్శించారు. రైతు రుణమాఫీ ఎప్పుడో చేస్తారో చెప్పాలని నిలదీశారు. రైతులకు ఇచ్చే రుణాలపై 6 శాతం వడ్డీ రాయితీ ప్రకటించాలని, కందులు, పసుపుకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల వెతలు తీర్చితే ముఖ్యమంత్రి కెసిఆర్‌ పుట్టినరోజును రైతుల దినోత్సవంగా జరుపుతామని అన్నారు. రైతుల కోసం వచ్చే బడ్జెట్ లో అయినా నిధులు కేటాయించాలని, రైతులకు సహకార సంఘాలు రుణ సౌకర్యం కల్పించాలని కోరారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/