అధిష్టానం ఆదేశిస్తే తెలంగాణ లో ఎక్కడి నుండైనా పోటీ చేస్తా – జీవిత రాజశేఖర్

బిజెపి అధిష్టానం ఆదేశిస్తే తెలంగాణ లో ఎక్కడి నుండైనా పోటీ చేస్తన్నారు జీవిత రాజశేఖర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర నిన్న శనివారం 11వ రోజుకు చేరింది. ఈ క్రమంలో జీవిత రాజశేఖర్ దంపతులు సంజయ్ తో కలిసి పాదయాత్ర చేసారు. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ… పార్టీ ఆదేశిస్తే ఎక్కడినుండి అయినా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

కొన్నాళ్ళు గా వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ కి దూరంగా ఉన్న, ఇప్పుడు పార్టీ కోసం క్రియాశీలకంగా పని చేయడానికి సిద్డంగా ఉన్నానని..మోడీ పాలన దేశానికి శ్రీరామ రక్ష , పార్టీ ఎలాంటి పని అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తెలంగాణ లో ఆడవాళ్లకు రక్షణ కావలంటే బీజేపీ పాలన రావాలి, మోడీ బారతదేశాన్ని కాపాడగలరనే విశ్వాసంతోనే మొదటి నుండి బిజెపి కి సపోర్ట్ చేస్తున్నాను అని తెలిపారు. టీఆరెస్ ప్రభుత్వ తీరుపట్ల తెలంగాణ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో వెనకబడి ఉందని..జీవిత చెప్పుకొచ్చారు.

ఇక బండి సంజయ్ పాదయాత్ర విషయానికి వస్తే.. నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు శివారులో పాదయాత్రను ప్రారంభించారు. నకిరేకల్ నియోజకవర్గం నుంచి తుంగతుర్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. తుంగతుర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు.