జెఇఇ మెయిన్స్ పరీక్షల వాయిదా
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన
New Delhi: దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ కావటంతో జెఇఇ మెయిన్స్-2021 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. ఈ నెల 24, 25, 26, 27, 28 తేదీల్లో నిర్వహించాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేసినట్టు పేర్కొంది. కాగా ఏప్రిల్ 27, 28, 30 తేదీల్లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ కూడా వాయిదా పడిన విషయం విదితమే.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/