అనంతపురం నుంచి కడప జైలుకు తరలింపు

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు ముగిసిన పోలీసు కస్టడీ..కడప జైలుకు తరలింపు

jc-prabhakar-reddy-sent-to-kadapa-jail

అనంతపురం: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టైన  టిడిపి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను అనంతపురం నుంచి కడప జైలుకు తరలించారు. పోలీసు కస్టడీ ముగియడంతో ఇద్దరినీ ఈరోజు అనంతపురం కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో, వీరిని జైలుకు పంపిస్తూ కోర్టు ఉత్వర్వులు జారీ చేసింది. మరోవైపు అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో తమను అక్రమంగా ఇరికించారని ఏపి హైకోర్టులో ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ఉమ, కుమారుడు అస్మిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తమపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని, కేసులో తదుపరి చర్యలను నిలిపివేసేలా ఆదేశాలను జారీ చేయాలని పిటిషన్ లో కోరారు. కాగా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిందే. ఇంకా రిమాండ్ కాలం కొనసాగుతోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/