స్మారక కేంద్రంగా జయలలిత నివాసం

బహిరంగ నోటీసు జారీ చేసిన ప్రభుత్వం

jayalalitha

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివాసం ‘వేద నిలయంగ’ సేకరించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ నోటీసు జారీ చేసింది. పోయెస్ గార్డెన్‌లోని  ‘అమ్మ’ నివాసాన్ని స్మారక కేంద్రంగా మార్చేందుకు నిర్ణయిస్తూ ప్రభుత్వం బహిరంగ నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో నిర్వాసితులుగా మారిన కుటుంబాలకు పునరావాసం కల్పించబోమని ప్రభుత్వం ఆ నోటీసులో స్పష్టం చేసింది. నిజానికి స్మారక కేంద్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 2018లో ప్రకటన చేసింది. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియలో భూమి కోల్పోయి, నిర్వాసితులుగా మారిన వారికి ఎటువంటి పునరావాసం ప్రభుత్వం కల్పించబోదని తాజా నోటీసులో స్పష్టం చేసింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/