సిఎం జగన్‌ సర్కార్‌పై జనసేన ట్వీట్‌

న్యాయస్థానాన్ని కూడా రద్దు చేస్తావా? అంటూ పోస్టు

JanaSena Party
JanaSena Party

అమరావతి: ఏపి సిఎం జగన్‌ సర్కారుపై జనసేన పార్టీ విమర్శలతో విరుచుకుపడింది. జనసేన తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఓ పోస్టును చేసింది. అందులో న్యాయస్థానాన్ని కూడా రద్దు చేస్తావా జగన్ రెడ్డి?’ అని ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించింది. ఎనిమిది నెలల్లో జగన్ తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ ఆయన తీరు సరికాదని హితవు పలికింది. ‘హడావుడిగా రాజధాని తరలింపు చేయడం తప్పు అని కోర్టు తెలిపింది. తెలుగు మాధ్యమం లేకుండా చేయడం సరికాదని చెప్పింది. ఉద్యమంలా చేపట్టిన ప్రభుత్వ కార్యాలయాలకి రంగులేసుకునే కార్యక్రమాన్ని తప్పుబట్టింది. నియంత ధోరణిలో నువ్వు తీసుకుంటోన్న నిర్ణయాలను తప్పుబడుతోందని న్యాయస్థానాన్ని కూడా రద్దు చేస్తావా జగన్ రెడ్డి?’ అంటూ జనసేన ప్రశ్నించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/