నేడు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం

నేడు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం కోసం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారమే విజయవాడ కు చేరుకున్నారు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. ఈ భేటీ కి ఇటీవల విశాఖలో వైస్సార్సీపీ ప్రభుత్వం అనుసరించిన విధానం, అక్కడ చోటు చేసుకున్న పరిణామాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే కౌలు రైతు భరోసా యాత్ర, జనసేన జనవాణి కార్యక్రమాల షెడ్యూల్ తేదీలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వినికిడి. అలాగే త్వరలో జరగబోయే నియోజకవర్గ సమీక్షల నిర్వహణ, పార్టీ బలోపేతంపై పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు.

ఇక శనివారం పార్టీ ఆఫీస్ లో విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన లో జైలు కు వెళ్లి వచ్చిన జనసేన నేతలను పవన్ కళ్యాణ్ సన్మనిచ్చారు. అరెస్ట్ సందర్భంగా వారు ఎదుర్కొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులోనూ ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.