ఈ నెల 18న సత్తెనపల్లిలో జనసేన కౌలు రైతు భరోసా కార్యక్రమం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన కౌలు రైతు భరోసా పేరిట ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు తనవంతు ఆర్ధిక సాయం అందజేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమందికి సాయం చేసిన పవన్ కళ్యాణ్..ఈ నెల 18 న సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా కార్యక్రమం చేపట్టబోతున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లలో అధికారిక లెక్కల ప్రకారం 1,673 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. రైతు స్వరాజ్య వేదిక సర్వే ప్రకారం ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల సంఖ్య 3 వేలకు పైనే ఉందని తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ నుంచి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు 7 జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమం పూర్తయిందని నాదెండ్ల పేర్కొన్నారు.