ఢిల్లీకి బయల్దేరిన పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan
Pawan Kalyan

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ వెళుతున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశం జరుగుతుండగా మధ్యలోనే పవన్‌ ఢిల్లీకి పయనమయ్యారు. కేంద్రం నుంచి ప్రముఖులతో సమావేశమయ్యేందుకు ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఖరారైన కారణంగానే ఆయన ఢిల్లీ వెళ్తున్నారు అని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పవన్‌ ఢిల్లీలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష జరిపే అవకాశం ఉన్నట్లు తెలిస్తోంది. అయితే ఎలాంటి విషయాలు పవన్‌ అక్కడ ప్రస్తావించనున్నారన్నది మాత్రం తెలియరాలేదు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/