బిజెపితో జనసేన పొత్తు శుభసూచకం

బిజెపితో పనిచేయడం వల్ల అంతా మంచే జరుగుతుంది

jd lakshmi narayana
jd lakshmi narayana

ప్రకాశం: బిజెపి పార్టీతో జనసేన పొత్తు మంచి శుభసూచకమని, జనసేన పార్టీ నేతగా తాను తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయాన్ని సమర్థిస్తున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారయణ అన్నారు. శుక్రవారం కందుకూరులో జరగిన పదోతరగతి విద్యార్థుల కార్యక్రమంలో జేడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బిజెపితో కలిసి పనిచేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామని చెబుతున్న నేపథ్యంలో జేడీ స్పందించారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకోవాలని జేడీ సూచించారు. ఇంకా శాసనమండలి రద్దు చేస్తారంటూ వస్తున్న వార్తలు నిజమైతే ఏపీ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని మంచి నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/