ఎయిర్‌పోర్టు ఘటనపై ఆధారాలు చూపాలని జనసేన డిమాండ్

విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైస్సార్సీపీ నేతల ఫై దాడి చేసారంటూ పోలీసులు జనసేన కార్య కర్తలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే, ప్రస్తుతం వీరంతా బెయిల్ ఫై బయటకు వచ్చినప్పటికీ..రీసెంట్ గా నగర పోలీస్ కమిషనర్ విశాఖ ఎయిర్‌పోర్టు ఘటనలో జనసేన కార్యకర్తలు పథకం ప్రకారమే మంత్రులపై దాడి చేసారని వ్యాఖ్యలు చేయడం పట్ల జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఘటనకు సంబంధించి ఆధారాలు చూపించకుండా తమ పార్టీ కార్యకర్తలపై ఎందుకు నిందలు వేస్తున్నరంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీపీ ఆధారాలు చూపించి జనసేనపై ఆరోపణలు చేయాలి లేకుంటే వైస్సార్సీపీ కండువా కప్పుకోవాలని విశాఖ తూర్పు నియోజకవర్గం జనసేన నాయకులు బాలి గౌరీ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఒకప్పుడు ఎలక్షన్‌లు అవినీతికి, అభివృద్ధికీ మధ్య జరిగేవని.., ఇప్పుడు అవినీతికి, ఇంట్లో ఆడవాళ్ళను దూషించడం మధ్య జరుగుతున్నాయన్నారు. 29 కేసులలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి సీఎం అవ్వొచ్చు కానీ ఏ అవినీతి కేసు లేని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వకూడదా ? అంటూ ప్రశ్నించారు. చెప్పు చూపించే వ్యక్తులు నాయకులా అని సీఎం జగన్ ప్రశ్నిస్తున్నారని.., మరి గతంలో నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా చంద్రబాబు గారిని గన్ పెట్టి కల్చేయాలి అన్నాది మీరు కదా అని ప్రశ్నించారు.