కశ్మీర్లో పేలుడు పదార్థాలు స్వాధీనం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో భారీగా పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాశ్మీర్లోని నాగరోటా వద్ద పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరగింది. ఈ ఎన్కౌంటర్లో జైషే ఈ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 3 టెర్రరిస్టులు హతమయ్యారు. అనంతరం ఘటన స్థలంలో భారీ మొత్తంలో పేలుడు పదార్ధాలను, అధునాతన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/