జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ అరెస్ట్

తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్-5 జోన్ కు వ్యతిరేకంగా జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తుళ్లూరులో 48 గంటల దీక్షకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో దీక్షకు వచ్చిన శ్రవణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తుళ్లూరు పీఎస్ కు తరలించారు.

ఆర్‌-5 జోన్‌ను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా తుళ్లూరులో తెనాలి శ్రావణ్ కుమార్‌ నిరసన చేపట్టారు. ఇదే టైంలోనే వైస్సార్సీపీ మద్దతు దారులు ఆర్‌-5 జోన్‌లో ఇళ్లు కేటాయింపును సమర్ధిస్తూ కృతజ్ఞత ర్యాలీకి ప్లాన్ చేశారు. ఇలా ఇరువర్గాల ర్యాలీలతో పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తుళ్లూరులో 144 సెక్షన్ వధించారు. నిరసన చేస్తున్న వారిని, దీక్షకు కూర్చున్న వారిని అరెస్టు చేశారు. పోలీసుల చర్యలను తెలుసుకొని రైతులకు సంఘీభావం తెలిపేందుకు అక్కడకు వచ్చిన జైభీం పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌ కుమార్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు అరెస్టు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. అరెస్టు చేసిన వారందర్నీ బలవంతంగా వాహనాల్లో ఎక్కించి తుళ్ళూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు.