బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని జగ్గారెడ్డి ఆగ్రహం

jagga reddy

బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. రాహుల్ జోడోయాత్ర కు వస్తున్న ఆదరణ చూసి బిజెపి భయం మొదలైందని..ఈ యాత్ర ఫై ఎలాంటి విమర్శలు చేయాలో అర్థంకాక..రాహుల్ టీ షర్ట్ లపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పెట్రోల్,డీజిల్ ధరలు , ప్రభుత్వ సంస్థల అమ్మకాల గురించి రాహుల్ గాంధీ అడిగే ప్రశ్న లకు సమాధానం చెప్పకుండా .. బీజేపీ టీ షర్ట్ ల రాజకీయం చేస్తోందన్నారు. ప్రధాని మోడీ పూటకో డ్రెస్ మారుస్తాడని.. మూడు పూటలకు 60 లక్షల ఖరీదు డ్రెస్ లు వేసే మోడీ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడదన్నారు. మోడీ ధరించే 60 లక్షల డ్రెస్ ఎక్కడ.. ,రాహుల్ గాంధీ ధరించే 40 వేల టీ షర్ట్ ఎక్కడా అని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అలాగే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సంగారెడ్డి నియోజక వర్గంలో 30 కిలోమీటర్లు ఉంటుందన్నారు. యాత్ర ప్రారంభం నుండి ముగింపు వరకు…స్వాగతం పలికేందుకు ప్రజల్ని ఎక్కువ భాగస్వామ్యం చేస్తామన్నారు. పెట్రో, గ్యాస్ ధరల భారం, అన్ని వర్గాల ప్రజలను రాహుల్ గాంధీ యాత్రలో భాగస్వామ్యం చేస్తామన్నారు. దీనిపై ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తున్నామన్నారు. ఓఆర్ఆర్ మీదుగా పాదయాత్ర చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. శంషాబాద్ ,రాజేంద్రనగర్ , మెహాదీపట్నం, గచ్చిబౌలి, లింగంపల్లి ,సంగారెడ్డి మీదుగా రాహుల్ గాంధీ పాదయాత్ర ఉండేలా చూడాలని పీసీసీని కోరుతానన్నారు. పాదయాత్రలో ప్రధానంగా రాహుల్ గాంధీ అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకునేలా ప్లాన్ చేస్తామన్నారు.