జగన్ కీలక నిర్ణయం..

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఇప్పటి నుండే నేతలకు కీలక పదవులు అప్పజెపుతున్నారు. తాజాగా పార్టీ లో మొదటిసారి రాష్ట్ర మ‌హిళా విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ పోస్ట్ ను ప్రవేశ పెట్టారు. దీనికి గాను ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిని నియామకం చేశారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అటు వైస్సార్సీపీ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రెసిడెంట్ గా ధనుంజయ్ రెడ్డి, బసిరెడ్డి సిద్ధార్ధ రెడ్డి నియామకం అయ్యారు.

గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గంపై అక్కడి నేతలతో సమీక్ష నిర్వహించిన జగన్ కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడారు. అనంతరం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైస్సార్సీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 సంవత్సరాలు వైస్సార్సీపీ కి తిరుగుండదని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లాలని నేతలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అందరికీ వివరించి ఆశీర్వాదం తీసుకోవాలని, ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని జగన్ దిశానిర్దేశం చేశారు.