హంపికి సీఎం జగన్ అభినందనలు
కెయిన్స్ లో ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్..చాంపియన్ గా నిలిచిన కోనేరు హంపి
అమరావతి : ఏపీ సీఎం జగన్ యూఎస్ లోని కెయిన్స్ లో జరిగిన ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ కెయిన్స్ కప్ లో చాంపియన్ గా నిలిచిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిని అభినందించారు. హంపి సాధించి విజయం రాష్ట్రంతో పాటు, దేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. 2020 సంవత్సరాన్ని విజయంతో ప్రారంభించిన హంపి, అదే ఊపును కొనసాగించాలని, రానున్న కాలంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కాగా, పదిమంది క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్ల క్లాసికల్ ఫార్మాట్ లో జరిగిన టోర్నిలో హంపి ఆరు పాయింట్లు సాధించి, టాప్-1 గా నిలిచి, కప్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/