జులై 26 నుండి వ‌ర‌ద ప్రాంతాల్లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

జులై 26 నుండి వ‌ర‌ద ప్రాంతాల్లో సీఎం జ‌గ‌న్ పర్యటించబోతున్నారు. ఈ మేరకు పర్యటనకు సంబదించిన షెడ్యూల్ విడుదలైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు , వరదలకు చాలాప్రాంతాలు ముంపుకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంపుకు గురైన ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించబోతున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించి వారి కష్టాలను అడిగితెలుసుకున్నారు.

ఇక ఇప్పుడు జగన్ సిద్ధమయ్యారు. వ‌ద‌ర ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికే ప‌రిహారం, నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేసిన ఏపీ ప్ర‌భుత్వం… వ‌ర‌ద ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తోంది. ఈ క్ర‌మంలో వ‌ర‌ద క్ర‌మంగా త‌గ్గుతున్న నేప‌థ్యంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి ఈ నెల 26 నుంచి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో పర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరుతున్నారు.

ఈ నెల 26న వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప‌రిశీల‌న‌కు వెళ్ల‌నున్న జ‌గ‌న్‌… ఆ మ‌రునాడు కూడా వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. రాజోలు, పి. గన్నవరం నియోజకవర్గాల్లోని లంక ప్రాంతాల్లో సీఎం ప‌ర్య‌ట‌న సాగుతుందని ప్రాథమిక స‌మాచారం.