రోజూ చేసే పరీక్షల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది

కలెక్టర్లు, ఎస్పీలతో సిఎం స్పందన కార్యక్రమం

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: సిఎం జగన్‌ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, ఇతర అంశాలపై స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈరోజు 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారని వివరించారు. కానీ కేసులు ఎక్కువగా వస్తున్నాయని రిపోర్టుల్లో తగ్గించి చూపే ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేశారు. రోజూ చేసే పరీక్షల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. రోజుకు 50 వేలకు పైగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం మనదేనని ఉద్ఘాటించారు. ప్రతి 10 లక్షల మందిలో 31 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, 90 శాతం పరీక్షలు కొవిడ్ క్లస్టర్లలో జరుగుతున్నాయని వివరించారు. ‘కొవిడ్ వస్తుంది, పోతుంది… ఇప్పటి పరిస్థితుల్లో కొవిడ్ తో కలిసి జీవించక తప్పద’ని సిఎం జగన్ అభిప్రాయపడ్డారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/