ఇచ్చిన హమీని జగన్‌ నిలబెట్టుకున్నారు

వైయస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రోజా

 roja
roja

అమరావతి: ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విధ్యాసంవత్సరం నుండి విధ్యార్ధులకు ఫీజు రియింబర్స్‌ మెంట్‌ ఇస్తున్నట్లు ప్రకటించిరది. ఇందుకు సంబందించిన డబ్బులు నేరుగా విద్యార్దుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై నగరి ఎమ్మెలే రోజా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమే ట్విట్టర్‌ లో ఓ పోస్ట్‌ చేశారు. లక్షలమంది విద్యార్ధులకు ఇచ్చిన హమిని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిలబెట్టుకున్నారని రోజా అన్నారు. జగనన్న విద్యాదీవేన పథకం ద్వారా 12 లక్షల మంది తల్లుల ఖతాల్లోకి ఫీజు రిఎంబర్స్‌ మెంట్‌ డబ్బులు పడతాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి విద్యార్ధికి సమానమైన, న్యాయమైన విద్య అందుతుందని అంటూ ట్వీట్‌ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/