రేపు వైఎస్సార్ జిల్లాకు సీఎం జగన్ పర్యటన

ఒకరోజు పర్యటనకు వెళుతున్న సీఎం

అమరావతి: సీఎం జగన్ రేపు వైఎస్సార్ జిల్లాకు వెళ్లనున్నారు. ఒకరోజు పాటు కొనసాగే పర్యటనలో… ప్రొద్దుటూరులో డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి మనవడి వివాహానికి హాజరవుతారు. అనంతరం పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో సమావేశమవుతారు.

జగన్ పర్యటన షెడ్యూల్ వివరాలు:

రేపు ఉదయం తన నివాసం నుంచి బయలుదేరి 9.50 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయల్దేరి 10.40 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 10.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బయల్దేరి 11 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. 11.25 గంటల నుంచి 11.40 వరకు తిరుపాల్ రెడ్డి మనవడి వివాహ వేడుకలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.10 గంటలకు పులివెందుల హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 12.20 గంటలకు పులివెందుల గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు.12.30 నుంచి 4.00 గంటల వరకు నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం 4.40 గంటలకు కడప ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి గన్నవరం చేరుకుంటారు. సాయంత్రం 5.45 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/