వలంటీర్ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన వాలంటీర్అ నురాధ

jagan mohan reddy
jagan-announces-5-laksh-exgratia-to-volunteers-family

అమరావతి: విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం వాలంటీర్ గబ్బాడ అనురాధ (26) గుండెపోటుతో మరణించి వార్తపై సిఎం జగన్‌ స్పందించారు. దీంతో వెంటనే సీఎంవో అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనురాధ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారాన్ని సిఎం జగన్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ… విపత్తు సమయంలో కూడా కష్టపడుతున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనురాధ కుటంబానికి వెంటనే పరిహారం అందేలా చూడాలని విశాఖ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. కాగా గ్రామ సచివాలయం వాలంటీర్ గబ్బాడ అనురాధ కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ ప్రాణాలు విడిచారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/